W.G: భీమవరం శ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ‘బ్యాండ్ మేళం’ చిత్ర హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు చేసి, వేద ఆశీర్వచనాలు అందజేశారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా భీమవరం వచ్చినట్లు రోషన్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.