BHPL: మండలం గొల్లబుద్ధారం గ్రామంలో ఆదివారం సాయంత్రం CPI మండల కమిటీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ, అటవీ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో సీపీఐ కమిటీలను పటిష్ఠం చేసి పార్టీ బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో CPI పార్టీ నేతలు, గ్రామస్తులు ఉన్నారు.