WGL: మిల్స్ కాలనీ PS పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. CI రమేష్ వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన నాగ్ భరత్ కుటుంబం అమ్మవారిపేటలోని ఓ ఇటుక బట్టీలో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. అయితే ఆయన కుమార్తె రూపాలి(15) రెండు రోజులుగా ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతోంది. కొంచం సమయం ఇవ్వాలని తల్లిదండ్రులు అడగగా మనస్తాపం చెంది ఉరివేసుకొని మృతి చెందింది.