సత్యసాయి: మడకశిర మండలం ఛత్రం గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్త విజయకుమార్ పక్షవాతంతో మంచాన పడటంపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి భార్య సమస్యను వివరించగానే స్పందించిన ఎమ్మెల్యే, ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తూ రూ. 1 లక్ష నగదు చెక్కును తక్షణ ఆర్థిక సాయంగా అందజేశారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.