MDCL: మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ శుక్రవారం అల్వాల్ పట్టణ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్ను సందర్శించారు. నిజామాబాద్–రాయలసీమ ఎక్స్ప్రెస్కు బొల్లారం స్టేషన్లో నిలుపుదల కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు విశాఖ ఎక్స్ప్రెస్, నాగావళి ఎక్స్ప్రెస్, నాగర్సోల్ ఎక్స్ప్రెస్ రైళ్లకు కూడా హాల్ట్ ఇవ్వాలని కోరారు.