MHBD: గార్ల మండల కేంద్రంలోని వర్తక సంఘ భవనంలో ఆదివారం మున్నేరు జల దోపిడి వ్యతిరేక రైతు సదస్సు నిర్వహించారు. మున్నేరు జలసాధన కమిటీ కన్వీనర్ గంగావత్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ.. పాత పద్ధతి ప్రకారమే మున్నేరు ప్రాజెక్టును నిర్మించాలని డిమాండ్ చేశారు. స్థానిక రైతులకు అన్యాయం జరిగేలా ప్రాజెక్టు అమలు చేయకూడదని, రైతులు ఉద్యమం ద్వారా అడ్డుకోవాలన్నారు.