PDPL: అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, సుల్తానాబాద్ మున్సిపాల్టీ పరిధి రెండో వార్డు కౌన్సిలర్ గాజుల రాజమల్లు పేర్కొన్నారు. రెండో వార్డు పరిధిలోని పలువురు ఇందిరమ్మ లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి సకాలంలో బిల్లులు పొందాలని లబ్ధిదారులకు సూచించారు.