KRNL: నగరపాలక సంస్థలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు ఆదివారం కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పరిశుభ్రత సమస్యలపై ప్రజలు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వవచ్చని, వాటిని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.