WNP: వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కరించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఆవరణలో జిల్లా సమావేశం నిర్వహించారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.