GDWL: విద్యార్థులు సైన్స్లో నూతన ఒరవడి సృష్టించాలని అయిజ ఎంఈవో రాములు దయాల్ పేర్కొన్నారు. నేషనల్ సైన్స్ డే ను పురస్కరించుకొని శనివారం పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు తయారుచేసిన ఆవిష్కరణలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.