W.G: అత్తిలి శ్రీవల్లీదేవసమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ రఘురామ్ నాయుడు సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా రఘురామ్ దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ కమిటీ తరపున స్వామివారి చిత్రపటాన్ని బహూకరించి సత్కరించారు.