BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ఈనెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7:00 వరకు నిత్య కైంకర్యాలు నిర్వహించి, ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. మరుసటి రోజు 4న ఉదయం 3:30 నుంచి సంప్రోక్షణ నిర్వహించి నిత్య కైంకార్యాలు యధావిధిగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే హోలీ ఉత్సవం ముందు రోజు నిర్వహిస్తున్నారు.