AP: న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచే బాధ్యత ప్రతిఒక్కరూ తీసుకోవాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ‘అనారోగ్య సమస్య రాగానే నయమవుతుందన్న నమ్మకంతోనే ఆస్పత్రికి వెళ్తారు. వైద్యులు ఇచ్చిన భరోసాతో తమకు స్వస్థత చేకూరుతుందని నమ్ముతారు. అలాగే కోర్టుకు వచ్చామంటే తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చేలా చేయాలి’ అని సూచించారు.