ప్రకాశం: వేట్లపాలెం పేలుడు ఘటనపై మంత్రి స్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 24 మంది మృత్యువాత పడటం దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తుందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.