ASR: ఉర్లకులపాడులో కిడ్నీ బాధితులను ఎమ్మెల్యే శిరీషాదేవి పరామర్శించారు. ఇక్కడ ఆరుగురు మరణించినా, నీటి నమూనాలు సురక్షితమేనని, అపోహలు వద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా మెరుగైన వైద్యం, గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంకు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.