నాగర్ కర్నూల్: కుమ్మెర మల్లన్న జాతరలో పసిపాప మరణించిన ఘటనపై SMలో జరుగుతున్న ప్రచారాన్ని DSP బుర్రి శ్రీనివాస్ ఖండించారు. ఈ విషాద ఘటనకు కొందరు రాజకీయ రంగు పులుముతున్నారని ఆయన ఆరోపించారు. అగ్రవర్ణాల వారు పాపను తన్నడం వల్లే మరణించిందన్న వార్తల్లో నిజం లేదని, అందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అప్పటి వరకు సంయమనం పాటించాలని కోరారు.