NRML: హైదరాబాద్లోని క్రేయాన్ ఆసుపత్రిలో చిన్నారుల వైద్యుడు డా.అభిషేక్పై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్ర ఐఎంఏ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐఎంఏ వైద్యులు శనివారం భారీ ధర్నా నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన వైద్యులు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.