AKP: జీవీఎంసీ అనకాపల్లి జోన్ 82వ వార్డు పరిధిలో మంజూరైన పనులను వెంటనే ప్రారంభించాలని కార్పొరేటర్ ఎం సునీత విజ్ఞప్తి చేశారు. విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. దోమలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవల తొలగించిన మలేరియా సిబ్బందిని తిరిగి నియమించాలన్నారు. స్మశాన వాటికలో చేపట్టిన పనులను పూర్తి చేయాలన్నారు.