CTR: పుంగనూరు మండలం చండ్ర మాకులపల్లి పంచాయతీ కృష్ణాపురానికి చెందిన రైతు దేవేంద్ర నాయుడుకి చెందిన నాలుగు మేకలను గుర్తు తెలియని దుండగులు దొంగిలించారు. ఈ ఘటనపై బాధితుడు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఏఎస్సై అశ్వత్ నారాయణ ఇవాళ మధ్యాహ్నం తెలిపారు.