VZM: గజపతినగరం గ్రామపంచాయతీలో కుళాయిల ద్వారా నీటి వృధా నివారణ చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆరిశెట్టి ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షుడు మేటి కోటి భాస్కరరావులు శనివారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోకి అందజేసిన వినతి పత్రంలో కోరారు. తాగునీటి కొళాయిలకు టాపు వాల్వు లేకపోవడంతో నీరు వృధాగా పోతున్నట్లు చెప్పారు.