BPT: ఎం.వి. రాజుపాలెం గ్రామానికి చెందిన శీలం సుబ్బారెడ్డికి డయాలసిస్ పింఛన్ను తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో శ్రీనివాసరావు, జడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి అందజేశారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికే పరిమితమైన వారికి ప్రత్యేక పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో పద్మావతి పాల్గొన్నారు.