ATP: తాడిపత్రి మండలం ఆలూరుకోన క్షేత్రంలో శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శేష తల్ప రంగనాథ స్వామివారు దివ్య మంగళ స్వరూపంలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాథుని దర్శనంతో భక్తులు పులకించిపోయారు.