ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయన స్వయంగా పెన్షన్ నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి నెలా సమయానికి పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.