KRNL: గోనెగండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి, కొళాయి, వాణిజ్య పన్నులను సకాలంలో చెల్లించి, గ్రామ అభివృద్ధికి బాటలు వేయాలని పంచాయతీ సెక్రెటరీ సతీశ్ ఇవాళ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా నేరుగా ఆన్లైన్లో పన్ను చెల్లింపులు చేపడుతుందన్నారు. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మార్చి 15 లోపు పన్నులు చెల్లించి, పంచాయతీకి సహకరించాలన్నారు.