KRNL: అవుకు మండల పరిధిలోని రాయలసీమ రైస్ మిల్ సమీపంలో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. మెట్టుపల్లి రోడ్ నుంచి అవుకు బస్టాండ్ వైపు వెళ్తున్న టీవీఎస్ ఎక్సెల్ బైక్లో మంటలు చెలరేగాయి. బైక్ నడుపుతున్న వ్యక్తి వెంటనే దిగిపోయి స్థానికుల సహాయంతో మంటలను ఆర్పగా, వాహనం పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.