‘బైసన్’తో నిరాశ చెందిన ధృవ్ విక్రమ్ తాజాగా తనకు ఒక క్రేజీ ఆఫర్ దక్కినట్లు ఇన్స్టా ద్వారా వెల్లడించాడు. దీంతో సందీప్ కిషన్ హీరోగా రూపుదిద్దుకుంటున్న ‘సిగ్మా’ మూవీలో ధృవ్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు గట్టిగా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏంటనేదానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.