BDK: రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని సుజాత నగర్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ నాయక్ డిమాండ్ చేశారు. యాసంగి వరి నాట్లు పూర్తి అయి రోజులు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను విడుదల చేయడంలో జాప్యం చేయడం తగదని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు అనంతరం రైతుబంధు ఇస్తామని హడావిడిగా ప్రకటించిన ప్రభుత్వం ఎటు పోయిందన్నారు.