జింబాబ్వేతో మ్యాచ్లో శివమ్ దూబే కేవలం రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు. దీనిపై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ స్పందిస్తూ.. దూబే బౌలర్గా ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యాడని పేర్కొన్నాడు. అతడితో బౌలింగ్ చేయించే ముందు జట్టు విజయావకాశాల గురించి ఆలోచించాలని టీమ్ మేనేజ్మెంట్కు సూచించాడు.