AP: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఇళ్ల నిర్మాణానికి అదనపు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు భద్రత, భరోసా కల్పిస్తాం. 2019కి ముందు కట్టిన ఇళ్లను గత ప్రభుత్వం కక్షగట్టి ఆపేసింది. గత ప్రభుత్వం ఆపేసిన ఇళ్లనూ త్వరలోనే పూర్తి చేసి ఇస్తాం. 2029లోగా అందరికీ ఇంటిస్థలాలు, ఇళ్లు ఇస్తాం’ అని హామీ ఇచ్చారు.