తూ.గో జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంఛార్జ్ జేసీ వై.మేఘా స్వరూప్ తెలిపారు. జిల్లాలో మొత్తం 2,68,564 మంది లబ్ధిదారులకు రూ.118,84,95,000 విలువైన నిధులు ఉన్నాయని వివరించారు. ఈ మేరకు జూన్ 1న వారి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయనున్నట్లు వివరించారు.