తనకు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి చేసిన సాయాన్ని దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి గుర్తుచేసుకున్నాడు. గతంలో వరదల వల్ల తన పంటపొలం కొట్టుకుపోయినప్పుడు కృష్ణారెడ్డి రూ.25 వేల ఆర్థిక సాయం చేశాడని, ఆ డబ్బుతోనే తండ్రి ఆ తొమ్మిది ఎకరాల పొలాన్ని మళ్లీ బాగు చేశారని తెలిపాడు. నాడు దక్కిన ఆ పొలం విలువ ఈరోజు రూ.5 కోట్లు అని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.