తూ.గో: నిడదవోలు ఫ్లెఓవర్ బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. సుమారు 35-40 సంవత్సరాల వయస్సు గల సదరు వ్యక్తి రైల్వే ట్రాక్ వెంబడి నడుచుకుంటూ వెళ్తుండగా, విజయవాడ వైపు వెళ్లే రైలు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తలపై బలమైన గాయం కావడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.