NZB: ధర్పల్లి మండలం గోవిందపల్లిలో అదనపు వరకట్నం వేధింపులతో వివాహిత లక్షిత (కవిత) మృతి చెందిన కేసులో పోలీసులు బుధవారం ముగ్గురిని అరెస్టు చేశారు. మృతురాలి భర్త కర్రోల్ల నెహ్రూ, అత్త కర్రోల్ల సత్తెమ్మ, మామ కర్రోల్ల రాజులు(పెద్ద రాజులు)ను కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.