శబరిమల అయ్యప్ప ఆలయ ధ్వజస్తంభం ఏర్పాటులో జరిగిన నిధుల గోల్మాల్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో నటులు మోహన్లాల్, దిలీప్ స్టేట్మెంట్లను కేరళ పోలీసులు రికార్డ్ చేశారు. 2017లో ధ్వజస్తంభం పునరుద్ధరణ సమయంలో జరిగిన అవకతవకలు, నిధుల వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరిగింది. దర్యాప్తులో భాగంగానే ఈ ప్రక్రియ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.