సంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో నేడు ఉదయం 10:30 గంటలకు పాత డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి ఎంవై నిర్మల తెలిపారు. అపోలో ఫార్మసీలో ఉద్యోగాల కోసం 10వ తరగతి ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి, 28 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.