NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 11 వార్డులో గుడిపల్లి కాలువపై నిర్మించనున్న కల్వర్టు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పట్టణ నాయకులు స్వాగతం పలికారు. 50 లక్షల రూపాయలతో కల్వర్టు రిటైనింగ్ నిర్మిస్తున్నామని చెప్పారు. బుచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.