TG: మేడ్చల్ జిల్లా శామీర్పేటలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ తహశీల్దార్ సుచరిత రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తన డ్రైవర్ ద్వారా ఆమె ఈ లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.