AP: అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి దగ్గర జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.