MBNR: కొత్తకోట మండలం చర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి (జీయంఆర్) పాల్గొన్నారు. లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యమన్నారు. మొదటి విడతలో మంజూరైన ఇండ్లలో 70% పూర్తయ్యాయని ఆయన తెలిపారు.