సత్యసాయి: హిందూపురంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు చట్టం 1861 సెక్షన్ 30 అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మత, రాజకీయాలకు అతీతంగా సోషల్ మీడియా పోస్టులు చేసే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.