KNR: హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ రోడ్డులో గల కాకతీయ కాలువలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. కాలువలో మృతదేహం కొట్టుకుపోతుండగా గుర్తించిన పోలీసులు, HNKలోని ఎల్కతుర్తి శివారులో దానిని బయటకు తీశారు. మృతుడు హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన పల్లకొండ గణేష్గా గుర్తించారు. ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడా లేదా, ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.