SKLM: పదవ తరగతి పరీక్షలు దగ్గర అవుతున్న సందర్భంగా తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని హెచ్ఎం ఒకలా రత్నమాల తెలిపారు. నరసన్నపేట మండలం సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఇంటి వద్ద చదువుతోపాటు వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలన్నారు.