ఏలూరు పార్లమెంటు పరిధిలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. గురువారం ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసి, ప్రజాదర్బార్ నిర్వహించారు. 53 మంది లబ్ధిదారులకు 41,40,368 విలువైన CMRF చెక్కులు అందించారు. విద్యార్ధుల భవిష్యత్తు కోసం AI ల్యాబులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.