KMR: జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జుక్కల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ దేశాయ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ పటేల్ ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు.