AP: ప్రతి ఎకరాకు నీరందించాలన్న సీఎం చంద్రబాబు సంకల్పం త్వరలో సాకారం అవుతుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సాగునీటి రంగంపై అసెంబ్లీలో చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం సాగునీటి రంగానికి రూ. 52,724 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. 20 నెలల్లో రూ. 25,948 కోట్లు ఖర్చు చేసి పురోగతికి బాటలు వేసిందని కొనియాడారు.