కృష్ణా: మచిలీపట్నంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్ నివాసంలో ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయని మచిలీపట్నం కార్పొరేషన్ కౌన్సిల్పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టాభి స్మారక భవనం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.