NDL: బండిఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామ శివారులో ఉన్న తెలుగు గంగ ప్రధాన కాలువకు 4-5 బ్లాకుల మధ్య భారీ గండి పడింది. దీంతో సాగునీరు వృథాగా ప్రవహిస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని నీటి ప్రవాహాన్ని తగ్గించారు. ఇటీవలే సమీపంలో గండి పూడ్చినప్పటికీ మళ్లీ గండి పడటంపై అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.