SDPT: చేర్యాల పట్టణ కేంద్రంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ పట్టణ నాయకులు తెలిపారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల వారికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, చేర్యాల నూతన కౌన్సిలర్ల పదవీ స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని పేర్కొన్నారు.