HYD: సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. మరోవైపు రైళ్లను నిలిపేందుకు తగిన స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇటీవల ఎంపీ ఈటెల రాజేందర్ సైతం అన్నారు. నార్త్ హైదరాబాద్ గుండెకాయ లాంటి బొల్లారం స్టేషన్ ప్రాంతాన్ని సైతం ఒక టెర్మినల్ చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది.