కోనసీమ: కొత్తపేట మండలం మోడేకుర్రు పరిధిలోని 11 కేవీ లైను మరమ్మతుల నిమిత్తం గురు, శుక్ర, శని వారాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు రాంబాబు తెలిపారు. ఆయా రోజుల్లో కడలివారిపాలెం, యలమంచిలి వారిపేటలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.